ఫిజిక్స్‌ కష్టం.. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షపై విద్యార్థుల అభిప్రాయం..!

దేశవ్యాప్తంగా ఢిల్లీ ఐఐటీ ఆదివారం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌–2020 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. దేశవ్యాప్తంగా ఈ పరీక్ష రాసేందుకు సుమారు 2.50 లక్షల మంది అర్హత సాధించినా.. 1,60,864 మంది ఈ పరీక్షకు దరఖాస్తు చేసిన సంగతి తెలిసిందే. కంప్యూటర్‌ ఆధారిత (సీబీటీ) విధానంలో ఉదయం పేపర్‌–1, మధ్యాహ్నం పేపర్‌–2 నిర్వహించారు. అభ్యర్థులు, ఆయా సబ్జెక్టుల అధ్యాపకుల విశ్లేషణ ప్రకారం కెమిస్ట్రీ కొంత సులభంగా ఉండగా ఫిజిక్స్.. మ్యాథమెటిక్స్‌ ప్రశ్నలు దీర్ఘత్వంతో కఠినంగా ఉన్నాయి. ఈ పేపర్లకు సంబంధించిన అభ్యర్థుల రెస్పాన్స్‌ షీట్లను ఈనెల 29న జేఈఈ అడ్వాన్సు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. సెప్టెంబర్‌ 30న సాయంత్రం 5 గంటల వరకు ఇవి అందుబాటులో ఉంటాయి. నెలాఖరున ప్రాథమిక కీని విడుదల చేస్తారు. అనంతరం అభ్యర్థుల నుంచి అభ్యంతరాల స్వీకరణ తర్వాత.. అక్టోబర్‌ 5న తుది కీ, ర్యాంకులతో సహా తుది ఫలితాలను ప్రకటిస్తారు. అక్టోబర్‌ 6వ తేదీ నుంచి జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ (జోసా) సీట్ల కేటాయింపునకు కౌన్సెలింగ్‌ను చేపడుతుంది. Must read: కొంచెం కష్టంగా..!
  • ప్రశ్నలను దీర్ఘంగా.. భిన్నమైన రీతిలో సంధించారు.
  • మ్యాథమెటిక్స్‌ ప్రశ్నలను పరిష్కరించడానికి అభ్యర్థులకు ఎక్కువ సమయం పట్టిందని.. కెమిస్ట్రీ సమతుల్యంగా, ఒకింత సులభంగా ఉందని నిపుణుల అభిప్రాయం.
  • కెమిస్ట్రీ విభాగంలోని ప్రశ్నలు ఎన్‌సీఈఆర్టీ ప్యాట్రన్‌ను అనుసరించి ఇచ్చినట్టుందన్నారు.
  • అభ్యర్థులకు ఆయా సబ్జెక్టులలోని వ్యక్తిగత ఆసక్తులను బట్టి కొందరికి కెమిస్ట్రీ కష్టం గాను, ఫిజిక్స్‌ వంటివి సులభంగాను ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమైంది.
  • బహుళైచ్ఛిక సమాధానాల ప్రశ్నలు కొంత సులభంగా ఉన్నాయన్నారు.
  • ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్‌లో ఒక్కో దానిలో 18 చొప్పున మొత్తం 54 ప్రశ్నలు ఇచ్చారు.
  • కెమిస్ట్రీలో భౌతిక రసాయన శాస్త్రం ప్రశ్నలు కొంచెం ఎక్కువ ఉన్నాయి.
  • మొత్తం మీద పేపర్‌–1 గత ప్రశ్నాపత్రంతో పోలిస్తే చాలా కష్టంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమైంది.
  • అయితే చాలా మంది పేపర్‌-1,2 లో ఫిజిక్స్‌ కాస్త కఠినంగా ఉందనే అభిప్రాయం వ్యక్తంచేశారు.
Also read:


from Education News in Telugu: News on Board Exam Results, Job Notifications, University Results in Telugu https://ift.tt/30uOzXp

Post a Comment

0 Comments