ఏపీ టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల షెడ్యూల్ విడుదల

ఏపీ పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది. బుధవారం షెడ్యూల్‌ను ప్రభుత్వం రిలీజ్ చేసింది. పరీక్షలు మార్చి 23 నుంచి ప్రారంభమై.. ఏప్రిల్ 8తో ముగుస్తాయి. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ టెన్త్ పరీక్షల షెడ్యూల్‌ను స్వయంగా ప్రకటించారు. ఈ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు జరగనున్నాయి. పరీక్షల షెడ్యూల్ ఇలా ఉంది..
మార్చి 23, 2020 ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ 1
మార్చి 24, 2020 ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ 2
మార్చి 26, 2020 సెకండ్‌ లాంగ్వేజ్‌
మార్చి 27, 2020 ఇంగ్లీష్ పేపర్‌ 1
మార్చి 28, 2020 ఇంగ్లీష్ పేపర్‌ 2
మార్చి 30, 2020 గణితం పేపర్‌ 1
మార్చి 31, 2020 గణితం పేపర్‌ 2
ఏప్రిల్‌ 01, 2020 జనరల్‌ సైన్స్‌ పేపర్‌ 1
ఏప్రిల్‌ 03, 2020 జనరల్‌ సైన్స్‌ పేపర్‌ 2
ఏప్రిల్‌ 04, 2020 సోషల్‌ స్టడీస్‌ పేపర్‌ 1
ఏప్రిల్‌ 06, 2020 సోషల్‌ స్టడీస్‌ పేపర్‌ 2
ఏప్రిల్‌ 07, 2020 సంస్కృతం, అరబిక్‌, పర్షియన్‌ సబ్జెక్ట్‌
ఏప్రిల్‌ 08, 2020 ఒకేషనల్‌ పరీక్షలు


from Education News in Telugu: News on Board Exam Results, Job Notifications, University Results in Telugu https://ift.tt/2HxRJ2F

Post a Comment

0 Comments