ఏపీలో పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీకి ఆగస్టు 26న నిర్వహించిన ప్రధాన పరీక్ష (మెయిన్స్) ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 49 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన ఆన్లైన్ పరీక్షకు 94.8 శాతం విద్యార్థులు హాజరయ్యారు. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన మొత్తం 14,175 అభ్యర్థుల్లో 13,695 మంది హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు. 480 మంది అభ్యర్థులు హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోలేదు. హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకున్న వారిలో మొత్తం 12,984 మంది అభ్యర్థులు మాత్రమే మెయిన్స్ పరీక్షకు హాజరయ్యారు. 711 మంది అభ్యర్థులు పరీక్షకు గైర్హజరయ్యారు. అనువాద దోషాలు రిపీట్.. ఎన్ని పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ.. పరీక్షల్లో అనువాద దోషాలు మాత్రం పునరావృతమవుతూనే ఉన్నాయి. పంచాయతీ కార్యదర్శి ప్రధాన పరీక్షలోనూ.. ఇంగ్లిష్ నుంచి తెలుగులోని ప్రశ్నలు, ఆప్షన్ల అనువాదంలో తప్పులు దొర్లాయని పరీక్షకు హాజరైన అభ్యర్థులు అంటున్నారు. Read Also: ఎక్కువ పశ్నలు వాటినుంచే.. పరీక్షలో ప్రధానంగా 'నవరత్నాలు', గ్రామీణాభివృద్ధికి సంబంధించిన అంశాలతో పాటు.. 73, 74 రాజ్యాంగ సవరణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అంశాలపై ఎక్కువ ప్రశ్నలు అడిగారని అభ్యర్థులు తెలిపారు. Read Also: ఏపీలో మొత్తం 1051 పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాల భర్తీకి ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి డిసెంబరు 19 నుంచి జనవరి 29 వరకు దరఖాస్తు స్వీకరించారు. ఈ పోస్టుల భర్తీకి రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 21న నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షకు మొత్తం 4,95,526 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 2,94,966 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. జులై 19న ఫలితాలను విడుదల చేయగా 14,175 మెయిన్ పరీక్షకు అర్హత సాధించారు. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఆన్లైన్ విధానంలో ఆగస్టు 26న మెయిన్ పరీక్ష నిర్వహించారు. మెయిన్ పరీక్షకు సంబంధించి 13,695 మంది హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోగా.. 12,984 మంది అభ్యర్థులు మాత్రమే మెయిన్స్ పరీక్షకు హాజరయ్యారు.
from Education News in Telugu: News on Board Exam Results, Job Notifications, University Results in Telugu https://ift.tt/30Blp6B


0 Comments