
ఏపీఈసెట్ ప్రవేశాల కౌన్సెలింగ్ గడువును మరోసారి పొడిగిస్తూ కన్వీనర్ ఎం.ఎం.నాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, విద్యార్హత సర్టిఫికెట్స్ పరిశీలన, కాలేజీల, కోర్సుల ఎంపిక, ఆప్షన్లకు నవంబరు 11 వరకు అవకాశం కల్పించారు. 13న సీట్లను కేటాయించనున్నారు. ఎన్సీసీ, మాజీ సైనిక కోటా, దివ్యాంగులు, స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్స్ పరిశీలనకు హాజరుకాని వారికి విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ సహాయ కేంద్రంలో హాజరయ్యేందుకు అవకాశం కల్పించారు. Must read: ఇంజనీరింగ్ డిప్లొమో పూర్తిచేసిన విద్యార్ధులు తదుపరి ఉన్నత సాంకేతిక విద్యను కొనసాగించేందుక వీలుగా నిర్వహిస్తున్న ఏపీ ఈసెట్-2020 పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 14న రాష్ట్రంలోని 79 కేంద్రాల్లో ఆన్లైన్ ద్వారా ఈ పరీక్షలు నిర్వహించారు. 31,891 మంది పరీక్షలకు హాజరుకాగా.. 30,654 మంది క్వాలిఫై అయ్యారు. 96.12 శాతం ఉత్తీర్ణత సాధించారు. క్వాలిఫై అయినవారిలో 25160 మంది పురుషులు, 6731 మంది మహిళలు ఉన్నారు. Also read:
from Education News in Telugu: News on Board Exam Results, Job Notifications, University Results in Telugu https://ift.tt/3lhbXzQ
0 Comments